క్షతగాత్రుల బ్యాగులో దొరికిన రూ.8.74 లక్షలు అప్పగింత
మునగాల, మార్చి 15: రోడ్డు ప్రమా దం జరిగిన ప్రాంతానికి వెళ్లిన 108 సిబ్బందికి రూ.8.74 లక్షల నగదు లభించగా వారు ఆ మొత్తాన్ని వైద్యులకు అందజేసి నిజాయితీని చాటుకున్నారు. ఏపీలోని గుంటూరుకు చెందిన అనంత వెంకట శివప్రసాద్(49), సత్యవతి దంపతులు వైద్యం కోసం కారులో హైదరాబాద్కు బయలుదేరారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం మాధవరం శివారు లో కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో వెంకట శివప్రసాద్ అక్కడికక్కడే మృతిచెందాడు. సత్యవతికి గాయా లు కాగా 108లో చికిత్స కోసం కోదాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కారు లో లభించిన బ్యాగ్లో నగదు ఉన్నట్టు గుర్తించిన 108 సిబ్బంది.. వెంటనే కోదాడ ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ విజయ్కుమార్కు అందజేశారు. ఆ డబ్బును లెక్కించగా రూ.8,74,400 ఉన్నట్టు 108 జిల్లా కోఆర్డినేటర్ అబ్దుల్ రహీమ్ తెలిపారు. మృతుడి ఒంటిపై ఉన్న రూ.4 లక్షల విలువైన బంగారు ఆభరణాలను కూడా అందజేసినట్టు చెప్పారు. నిజాయితీ చాటుకున్న 108 పైలెట్ రాంబాబు, ఈఎంటీ నాగేశ్వర్రావును అభినందించారు.