దివంగత బాలీవుడ్ అగ్రనటుడు రిషికపూర్ నటించిన చివరి చిత్రం ‘శర్మాజీ నామ్కీన్’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నది. రిషికపూర్ 69వ జయంతి సందర్భంగా శనివారం చిత్ర ఫస్ట్లుక్ను ఆయన తనయ రిద్దిమా కపూర్ విడుదలచేసింది. ఈ పోస్టర్లో సూట్కేస్ పట్టుకొని చిరునవ్వులు చిందిస్తూ రిషికపూర్ కనిపిస్తున్నారు. అరవై ఏళ్ల వృద్ధుడి కథాంశంతో సున్నితమైన ఉద్వేగాల కలబోతగా ఈ చిత్రం తెరకెక్కుతున్నది. సినిమా చిత్రీకరణ దశలో ఉండగానే రిషికపూర్ మరణించారు. అతడి పాత్రలో పరేష్రావేల్ను తీసుకొని మిగతా షూటింగ్ను పూర్తిచేశారు. ‘రిషికపూర్ను ఆరాధించి గౌరవించే కోట్లాది మంది అభిమానులకు చిరకాలం గుర్తుండిపోయే బహుమతిగా ఈ సినిమా ఉంటుంది’ అని రిద్దిమా కపూర్ చెప్పింది. ఈ చిత్రానికి హితేష్భాటియా దర్శకత్వం వహించారు. అనారోగ్య కారణాలతో గత ఏడాది రిషికపూర్ కన్నుమూసిన విషయం తెలిసిందే.