కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) టాలీవుడ్ యాక్టర్ రాంచరణ్ (Ram Charan) కాంబోలో ఓ సినిమా వస్తున్న విషయం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ డైరెక్టర్ కమ్ యాక్టర్ అభిమానులు, ఫాలోవర్లు సినిమా కొత్త అప్ డేట్స్ కోసం చాలా ఎక్జయిటింగ్ గా ఎదురుచూస్తున్నారు. దిల్రాజు నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన క్రేజీ అప్ డేట్ ఒకటి ఇండస్ట్రీ సర్కిల్ లో చక్కర్లు కొడుతోంది.
ఈ ప్రాజెక్టులో మరో కోలీవుడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు (Karthik Subbaraj) భాగస్వామ్యం కావబోతున్నాడట. డైరెక్టర్ శంకర్ ఈ సినిమా కథను డెవలప్ చేసే పనిని కార్తీక్ సుబ్బరాజుకు అప్పగించినట్టు టాక్ వినిపిస్తోంది. పొలిటికల్ డ్రామా నేపథ్యంలో చరణ్ సినిమాను రెడీ చేశాడు శంకర్. పొలిటికల్ టచ్ తోపాటు మాస్ ఎలిమెంట్స్ కూడా భారీగానే ఈ చిత్రంలో పెట్టినట్టు టాక్. ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.
రాంచరణ్ కెరీర్ లో 15వ సినిమాగా ఈ ప్రాజెక్టు తెరకెక్కుతోంది. పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్ లో స్టోరీని సిద్దం చేస్తున్నాడు శంకర్. మరోవైపు కార్తీక్ సుబ్బరాజు ఇటీవలే ధనుష్ తో తీసిన జగమే తంత్రం ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి టాక్ సొంతం చేసుకుంది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కింది జగమే తంత్రం.
ఇవికూడా చదవండి..
Chiranjeevi | బాబీ చిత్రంలో చిరంజీవి రోల్ తెలిసిపోయింది..!
Seetimaarr |ఈల వేసేందుకు గోపీచంద్ రెడీ..సీటీమార్ రిలీజ్ డేట్ ఫిక్స్
Chiranjeevi |ముఠామేస్త్రి స్టైల్ లో చిరంజీవి..షేర్ చేసిన బాబీ