ఐదో వన్డేలోనూ భారత్ ఓటమి
లక్నో: కెప్టెన్ మిథాలీ రాజ్ (104 బంతుల్లో 79 నాటౌట్; 8 ఫోర్లు, ఓ సిక్స్) మినహా మిగిలిన వారు విఫలమవడంతో దక్షిణాఫ్రికా చేతిలో భారత మహిళల జట్టుకు మరో ఓటమి ఎదురైంది. బుధవారం ఇక్కడ జరిగిన ఐదో వన్డేలో టీమ్ఇండియా ఐదు వికెట్ల తేడాతో పరాజయం పాలై.. 1-4తో సిరీస్ను ముగించింది. మిథాలీ రాజ్ ఒంటరి పోరాటం చేసినా మిగిలిన వారు సహకరించకపోవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 48.2 ఓవర్లలో 188 పరుగులకు ఆలౌటైంది. హర్మన్ ప్రీత్ (30) బాగానే ఆడినా రిటైర్డ్హర్ట్గా వెనుదిరిగింది. సఫారీ బౌలర్లలో డిక్లెర్క్ మూడు, షంగసె, సెకుకునే తలా రెండు వికెట్లు పడగొట్టారు. లక్ష్యఛేదనలో 48.2 ఓవర్లలో ఐదు వికెట్లకు దక్షిణాఫ్రికా 189 పరుగులు చేసి గెలిచింది. మిగ్నాన్ డుప్రెజ్ (57), అనెకె బాష్ (58) అర్ధశతకాలతో రాణించారు. భారత బౌలర్లలో గైక్వాడ్ మూడు, హేమలత, ప్రత్యూష చెరో వికెట్ తీసుకున్నారు