రెజీనా, నివేథా థామస్ ప్రధాన పాత్రల్లో ఓ సినిమా ప్రారంభమైంది. సౌత్ కొరియన్ సినిమా మిడ్ నైట్ రన్నర్స్కు రీమేక్గా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ మార్చిలో పూర్తి కాగా.. తాజాగా తుది షెడ్యూల్ షూట్ ఇవాళ తిరిగి మొదలైంది. ఈ సందర్భంగా షూటింగ్ లొకేషన్లోని ఫొటోను చిత్రం బృందం పంచుకుంది. ఈ ఫొటోలో రెజీనా, నివేదా థామస్, దర్శకుడు సుధీర్ వర్మ, కెమెరామ్యాన్ రిచర్డ్ ప్రసాద్ నవ్వుతూ కనిపించారు. ఈ సినిమాకు శాకినీ ఢాకినీ టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ రీమేక్కు సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. మేల్ వర్షన్లో ఉన్న ఒరిజినల్ సినిమాను ఫీమేల్ వర్షన్లోకి మార్చి సుధీర్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సురేశ్ బాబు, సునీతా తాతి, హ్యున్యూ థామస్ కిమ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.