24 గంటల్లో ఒకే ఇంట్లో ముగ్గురు మరణం
కాప్రా, మే 10: కరోనా మహమ్మారి కుటుంబాలకు కుటుంబాలనే కబలిస్తున్నది. తమ బిడ్డలు కళ్లెదుటే కరోనాకు బలైపోతుంటే, తట్టుకోలేక వారి తల్లిదండ్రులు కుప్పకూలిపోతున్నారు. ఇలాంటి విషాదమే హైదరాబాద్ కాప్రా డివిజన్ వంపుగూడలో జరిగింది. పీసరి హరీశ్వర్రెడ్డి (31) ఆదివారం కరోనాతో మృతి చెందారు. కొడుకు మరణాన్ని తట్టుకోలేక ఆయన తల్లిదండ్రులు జనార్దన్రెడ్డి (60), జ్యోతి (54) 24 గంటల్లోనే గుండెపోటుతో కన్నుమూశారు. ఐదునిమిషాల వ్యవధిలోనే ఇద్దరూ మృతిచెందారు. ఇదే తరహాలో హైదరాబాద్లోని హెచ్బీ కాలనీ ఫేజ్-2 వెల్ఫేర్ అసోసియేషన్ సం యుక్త కార్యదర్శి ప్రభుకుమార్ (42) ఏప్రిల్ 25న కరోనాతో మృతిచెంచారు. కొడుకు మరణాన్ని తట్టుకోలేక ఆయన తల్లి భారతీబాయి ఈ నెల 6న, తండ్రి మాధవాచారి 7న మృతిచెందారు. లక్ష్మీనగర్లో బడేమియా (70)గా పేరొందిన ఓ ఫంక్షన్హాలు యజమాని పెద్దకు మారుడు కరోనాతో ఆరునెలలక్రితం మరణించాడు. చిన్న కుమారుడు రెండువారాల క్రితం, బడేమియా గతవారం మృతిచెందారు.