సంగారెడ్డి మున్సిపాలిటీ, మే 9 : మార్కెట్లలో కూరగాయల విక్రయదారులు కరో నా నిబంధనలు పాటించాలని మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్ సూచించారు. ఆదివారం పోతిరెడ్డిపల్లిలో నిర్వహించిన సండే మార్కెట్ను కమిషనర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొన్నకాలనీ, పీఎస్ఆర్ గార్డెన్స్ తదితర ప్రాంతాల్లో కూరగాయలు అమ్ముకోవాలని విక్రయదారులకు సూచించారు. ప్రతిఒక్కరూ మాస్క్లు ధరించి భౌతిక దూరం పాటించాలని తెలిపారు. ఆయ న వెంట మున్సిపల్ ఆర్ఐ సూ ర్యప్రకాశ్, శానిటరీ ఇన్స్పెక్టర్ సంపత్రెడ్డి, హెల్త్ అసిస్టెంట్ విజయ్బాబు పాల్గొన్నారు.
సదాశివపేటలో…
సదాశివపేట, మే 9 : కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈనెల 13 నుంచి 20 వరకు కిరాణా దుకాణాలు మూసివేయనున్నట్టు సదాశివపేట కిరాణా దుకాణాల అసోసియేషన్ కార్యవర్గం తీర్మా నం చేసింది. ఆదివారం సదాశివపేట పట్టణంలో దుకాణాల యజమానులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కిరాణా దుకాణాలు పూర్తి స్థాయిలో బంద్ చేయాలని నిర్ణయించారు.అనంతరం వారు మాట్లాడుతూ సదాశివపేట పట్టణంలో పెద్ద ఎత్తున కొవిడ్ కేసులు పెరుగుతున్నాయన్నారు. దుకాణాలు తెరువడం వల్ల కరోనా కేసు లు మరింత పెరిగే అవకాశం ఉందని, పూర్తి స్థాయిలో లాక్డౌన్ విధిస్తామని తెలిపారు. లాక్ డౌ న్కు ప్రజలు సహకరించాలని కోరారు.