ముంబై : మహారాష్ట్రలో శివసేన సారధ్యంలోని సంకీర్ణ సర్కార్కు ముంబై మాజీ పోలీస్ అధికారి, ప్రస్తుతం ఎన్ఐఏ కస్టడీలో ఉన్న సచిన్ వజేతో సమస్యలు ఎదురవుతాయని తాను పార్టీ నేతలను హెచ్చరించానని ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. సచిన్ వజే ఉదంతం సేన సర్కార్కు కొన్ని గుణపాఠాలు నేర్పిందని వ్యాఖ్యానించారు.
కాగా పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ ఇంటివద్ద పేలుడు పదార్ధాలతో కూడిన ఎస్యూవీని నిలిపిన ఘటనలో ప్రమేయం ఉందనే ఆరోపణలతో వజేను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్కు వజేతో ఉన్న సంబంధాలపై సంకీర్ణ సర్కార్లో చిచ్చు రేగింది. ఓవైపు రౌత్ వ్యాఖ్యలతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ రహస్య భేటీతో మహారాష్ట్ర రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న సంకేతాలు వెల్లడయ్యాయ.