కోల్కతా: పశ్చిమబెంగాల్లో తొలి విడుత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉదయం ఏడు గంటలకు మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ క్రమంగా పుంజుకుంటున్నది. కాగా, కోంటై నియోజకవర్గంలోని 149వ నంబర్ పోలింగ్ బూత్ వద్ద అధికార తృణమూల్ కాంగ్రెస్ శ్రేణులు అవకతవకలకు పాల్పడుతున్నారని బీజేపీ అగ్రనేత సువేందు అధికారి సోదరుడు సౌమెందు అధికారి ఆరోపించారు.
బీజేపీకి అనుకూలురైన ఓటర్లను పోలింగ్ బూత్లోకి వెళ్లకుండా టీఎంసీ శ్రేణులు అడ్డుకుంటున్నాయని, వారిపై దౌర్జన్యం చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని సౌమెందు ఆరోపించారు. అధికారులు పోలింగ్ సజావుగా సాగేలా చూడాలని, ఈ విషయమై తాము ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశామని ఆయన చెప్పారు.