టీమిండియా మహిళా క్రికెట్ జట్టు లెజెండ్ మిథాలిరాజ్ జీవితకథ ఆధారంగా బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటి తాప్సీ పన్ను మిథాలిరాజ్ పాత్రలో నటిస్తోంది. బయోపిక్ కు శభాష్ మిథు అనే టైటిల్ ఖరారు చేశారు మేకర్స్. ఈ మూవీ కోసం ఇప్పటికే క్రికెట్లో శిక్షణ కూడా తీసుకుంది. అయితే ప్రాజెక్టు ప్లాన్ లో మార్పులు చోటుచేసుకున్నట్టు బీటౌన్ వర్గాల టాక్. ఈ చిత్రాన్ని రాహుల్ ఢోలాకియా డైరెక్ట్ చేయాల్సి ఉంది.
అయితే రాహుల్ స్థానంలో బెంగాలీ డైరెక్టర్ శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వ బాధ్యతలు తీసుకుంటున్నారట. మరి ఇలా సడెన్ గా డైరెక్టర్ మార్పుకు గల కారణాలు తెలియాల్సి ఉంది. శభాష్ మిథు టీం త్వరలోనే సెట్స్ లో జాయిన్ అయ్యేందుకు రెడీ అవుతోంది. మిథాలిరాజ్ తన క్రికెట్ కెరీర్ లో ఎదుర్కొన్న సంఘటనలు, మైలురాళ్లను బయోపిక్లో చూపించబోతున్నారు.
ఇవి కూడా చదవండి..
బ్లాక్ లెదర్ డ్రెస్ లో మెరిసిపోతున్న కృతిసనన్
మరో బిజినెస్ వైపు సమంత అడుగులు..!
నా బాయ్ఫ్రెండ్ కు క్రెడిట్ ఇవ్వాలి: అవికా గోర్
శ్రియా అందాల ఆరబోత..వీడియో హల్చల్
రాజా విక్రమార్క టైటిల్తో కార్తికేయ చిత్రం
పంజాబీ సినిమాలపై ఆర్ఎక్స్ 100 భామ ఫోకస్..!
నో ఏజ్..నాగార్జున డెడికేషన్కు సలాం కొట్టాల్సిందే..!
అనన్యపాండే క్యాలెండర్ స్టిల్ అదరహో..!