కోల్కతా : పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు, మాజీ ఎంపీ అభిజిత్ ముఖర్జీ సోమవారం పాలక తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో చేరారు. టీఎంసీలో చేరిక సందర్భంగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
కాగా, కోల్కతాలో గత నెలలో టీఎంసీ నేత, దీదీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీని అభిజిత్ ముఖర్జీ కలవడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ క్రమంలో టీఎంసీ నేతలతో అభిజిత్ పార్టీ మారే విషయంపై సంప్రదింపులు జరుపుతూ వచ్చారు. మరోవైపు ఇటీవల నకిలీ వ్యాక్సినేషన్ స్కామ్పై దీదీకి మద్దతుగా అభిజిత్ ట్విట్టర్ వేదికగా తన వాణిని వినిపించారు. కేంద్రంలోని మోదీ సర్కార్పై ఈ సందర్భంగా వ్యంగ్యాస్త్రాలు సంధించడంతో అభిజిత్ తృణమూల్ కాంగ్రెసలో చేరతారనే ప్రచారం ఊపందుకుంది.