చార్మినార్ టూ కన్యాకుమారి..
31 రోజుల్లో 19 రాష్ర్టాల్లో పర్యటన
చౌటుప్పల్కు చేరిన సందేశ్యాత్ర
బైక్యాత్ర చేపట్టిన మెజీషియన్ రామకృష్ణ
యాత్రకు స్వాగతం పలికిన తహసీల్దార్ గిరిధర్
చౌటుప్పల్ మార్చి19: ప్రాణాం తకమైన కరోనాపై అప్రమత్తంగా ఉండాలి.. మాస్కులు, శానిటైజ ర్లు విధిగా వాడాలని ప్రముఖ మె జీషియన్ గద్దెపాటి రామకృష్ణ కో రారు. ఓల్డ్సిటీలోని చార్మినార్ నుంచి కన్యాకుమారి వరకు కళ్లకు గంతలు కట్టుకొని ఆయన చేపట్టి న సందేశ్ బైక్యాత్ర శుక్రవారం చౌటుప్పల్ చేరుకుంది. ఈ యా త్రకు తహసీల్దార్ గిరిధర్ స్వాగ తం పలికి ఆయనను అభినందిం చారు. ఈ సందర్భంగా రామకృ ష్ణ మాట్లాడుతూ కరోనాపై దేశ ప్రజలను అప్రమత్తం చేసేందుకే 31 రోజులు..19 రాష్ర్టాల్లో ఈ సందేశ్ యాత్ర చేపట్టే విధంగా ప్రణాళిక రూపొందించుకున్నట్లు తెలిపారు. మన రాష్ట్రం తో పాటు కేరళ, హర్యానా, జైపూర్ తదితర రాష్ర్టాల మెజీషియన్ల సహకారంతో ఈ యాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతి 300 కి.మీలలో స్వాగతం పలికేందుకు ఆయా రాష్ర్టాల మెజీషియన్లు తోడ్పాటునందిస్తున్నారన్నారు. తన సొంత ఖర్చులతో చేపడుతున్న ఈ యా త్రకు స్వాగతం పలుకుతున్న ప్రతి ఒక్కరికీ ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.