న్యూఢిల్లీ: తమ జట్టు ఆటగాళ్లు, సహాయ సిబ్బందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా వారందరికీ నెగెటివ్ రావడంతో ముంబై ఇండియన్స్ ఊపిరిపీల్చుకుంది. భారత మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరేకు కొవిడ్-19 పాజిటివ్గా నిర్ధారణ అయిందని ముంబై మంగళవారం తెలిపిన విషయం తెలిసిందే. కిరణ్ ముంబై జట్టు వికెట్ కీపింగ్ సలహాదారుగా ఉన్నారు. మోరేకు పాజిటివ్ రావడంతో అప్రమత్తమైన ఫ్రాంఛైజీ అందరికీ పరీక్షలు చేయించింది.
డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై రాబోయే ఐపీఎల్ 14వ సీజన్ కోసం సన్నద్ధమవుతోంది.
వచ్చే శుక్రవారం చెన్నై వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో టోర్నీ తొలి మ్యాచ్లో తలపడనుంది. అనూహ్యంగా కిరణ్కు కరోనా సోకినట్లు తెలియగానే మంగళవారం ట్రైనింగ్ సెషన్ను రద్దు చేశారు. మోరే కూడా జట్టు సభ్యులు బస చేస్తున్న హోటల్లోనే ఉండటంతో వెంటనే కొవిడ్ టెస్టులు చేయించగా ప్రస్తుతం అందరికీ నెగెటివ్ వచ్చింది.