న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. ధరల పెంపునకు ఒక్కరోజు విరామం ఇచ్చిన చమురు కంపెనీలు వినియోగదారునికి జేబుకు మళ్లీ చిళ్లు పెట్టాయి. రోజువారీ సమీక్షలో భాగంగా ఇవాళ లీటరు పెట్రోల్పై 35 పైసలు, డీజిల్పై 26 పైసల చొప్పున వాతపెట్టాయి. దీంతో దేశరాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.100.91కి చేరగా, డీజిల్ ధర రూ.89.88కి పెరిగింది. అదేవిధంగా ముంబైలో పెట్రోల్ రూ.106.93, డీజిల్ రూ.97.46, భోపాల్లో పెట్రోల్ రూ.109.24, డీజిల్ రూ.98.67, కోల్కతాలో రూ.101.01, రూ.92.97గా ఉన్నాయి. ఇక హైదరాబాద్లో లీటర్ పెట్రోల్పై 37 పైసలు, డీజిల్పై 28 పైసల చొప్పున పెరిగి రూ.104.87, రూ.97.96కు చేరాయి.