అమరావతి,జూలై:ఒంగోలులో పెట్రో బాంబులు కలకలం రేపాయి.పెట్రో బాంబులతో ఇంటిపై దాడి చేసిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులోని బాలాజీ రెవెన్యూ కాలనీలో చోటుచేసుకున్నది.ఇంటి అద్దాలు ధ్వంసం చేసిన నిందితులు ఆపై పెట్రో బాంబులు విసరడంతో గోడలపై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పాతకక్ష్యల నేపథ్యంలోనే ఈఘటన జరిగినాట్లు తెలుస్తోంది.ఈ విషయంలో బాధితులు గతంలోనేపోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసును విచారిస్తున్నారు.