న్యూఢిల్లీ : దేశంలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరిగాయి. మంగళవారం కాస్త తగ్గిన కేసులు.. బుధవారం ఎక్కువయ్యాయి. గడిచిన 24 గంటల్లో 13,742 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా 14,037 మంది కోలుకున్నారని చెప్పింది. వైరస్ ప్రభావంతో 104 మంది మృత్యువాతపడ్డారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,10,30,176కు చేరింది. 1,07,26,702 మంది ఇప్పటి వరకు వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 1,56,567 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం దేశంలో 1,46,907 యాక్టివ్ కేసులున్నాయని చెప్పింది. ఇప్పటి వరకు టీకాడ్రైవ్లో భాగంగా 1,21,65,598 మందికి వ్యాక్సిన్ వేసినట్లు కేంద్రం వివరించింది. ఇదిలా ఉండగా.. దేశంలో ఒకే రోజు 8,05,844 శాంపిల్స్ పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ తెలిపింది. ఇప్పటి వరకు 21,30,36,275 టెస్టులు నిర్వహించినట్లు వివరించింది.