హైదరాబాద్ : ఉపరితల ద్రోణి కారణంగా రాష్ట్రంలో ఈ నెల 23 వరకు మూడు రోజుల పాటు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. విదర్భ, దాని పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం 0.9 కిలోమీటర్ల ఎత్తువరకు విస్తరించి ఉంది. కర్ణాటక తీరం నుంచి అంతర కర్ణాటక, దక్షిణ మధ్య మహారాష్ట్ర మీదుగా మరాఠ్వాడ వరకు ఉపరితల ద్రోణి 0.9 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నది. దీని ప్రభావంతో ఈ నెల 23 వరకు రాష్ట్రంలో ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.