పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పీరియాడిక్ రొమాంటిక్ డ్రామా రాధేశ్యామ్ చేస్తున్న సంగతి తెలిసిందే. రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ షూటింగ్ కొంత ప్యాచ్ మినహా పూర్తయింది. గురువారం రాత్రి నుంచి మిగిలిన భాగాన్ని జెట్స్పీడ్లో షూట్ చేస్తున్నట్టు టాలీవుడ్ సర్కిల్ టాక్. దీనికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి లైమ్లైట్ లోకి వచ్చింది. ప్రభాస్ పెద్దనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు, అంకుల్తో కొన్ని సీన్ల షూట్లో పాల్గొంటున్నాడట.
రెబల్ స్టార్, యంగ్ రెబల్ స్టార్లు ఇద్దరూ మరోసారి స్క్రీన్ పై మెరువనున్నారన్న వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. లవ్ స్టోరీగా వస్తున్న రాధేశ్యామ్లో కృష్ణంరాజును డైరెక్టర్ రాధాకృష్ణకుమార్ ఎలాంటి పాత్రలో చూపిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. రాధేశ్యామ్లో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన రాధేశ్యామ్ కోవిడ్ సెకండ్ వేవ్తో ఆలస్యమైంది. జులై 30న గ్రాండ్ గా విడుదల కాబోతుంది.
ఇవి కూడా చదవండి..
రోజుకు ఎన్ని సిగరెట్లు తాగుతారు..రష్మికకు అభిమాని ప్రశ్న
నాలో మూడు మార్పులొచ్చాయి : సమంత
వెకేషన్ డేస్ను గుర్తు చేసుకున్న రకుల్..స్టిల్స్ వైరల్
ప్రభాస్ టు సాయిపల్లవి..సౌతిండియా స్టార్లు ఏం చదివారో తెలుసా..?
ఈ స్టార్ హీరోకు పాపులర్ హీరోయిన్ కావాలట..!
ఫాలోవర్లు, ఫ్యాన్స్ కు కొరటాల శివ షాక్