టాలీవుడ్ యాక్టర్ పవన్కల్యాణ్ ఏర్పాటు చేసిన పవన్కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ (పీకేసీడబ్ల్యూ), పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎల్ఎల్పీతో భాగస్వామ్యం అయింది. వివిధ భాషల్లో సినిమా, స్టోరీ టెల్లింగ్ విభాగాల్లో కొత్త రచయితలు, స్టోరీ టెల్లర్స్, కొత్త టాలెంట్ కు ప్రోత్సాహం అందించే ఉద్దేశంతో పీకేసీడబ్ల్యూను స్థాపించాడు పవన్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ 10+ ఫీచర్ ఫిల్మ్స్ ఫ్యాక్టరీ మోడల్తో సినిమాలను నిర్మిస్తోంది. టీజీ విశ్వ ప్రసాద్ పీపుల్ మీడియాను స్థాపించారు.
ఇపుడు పవన్, టీజీ విశ్వప్రసాద్ ఇద్దరూ కలిసి యువ టాలెంట్ను ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నారు. కొన్ని సినిమాల్లో పవన్ కల్యాణ్ కూడా కనిపిస్తాడని సమాచారం. 6 చిన్న స్థాయి ప్రాజెక్టులు, 6 మీడియం స్థాయి ప్రాజెక్టులు, 3 పెద్ద చిత్రాలను రూపొందించాలని ప్లాన్ చేశారట. ఇండస్ట్రీలోకి రావాలనుకునే వారికి సినిమా మేకింగ్తోపాటు అన్ని విభాగాల్లో తాజా, కొత్త ఐడియాలతో వచ్చే వారికి అవకాశం ఇవ్వనున్నారు.
హరీశ్ పై క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా పనిచేయనున్నారు. ఓ వైపు సినిమాలు, రాజకీయాలతో బిజీగా ఉండే పవన్..రాబోయే కాలంలో కొత్త నటీనటులను ప్రోత్సహించేందుకు కొత్త ప్లాట్ఫాం క్రియేట్ చేయడం ప్రశంసించదగిని విషయమనే చెప్పాలి.