హాస్యనటి శ్రీలక్ష్మి, పార్వతీశం ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సావిత్రి w/o సత్యమూర్తి’. నరేంద్ర గోగుల నిర్మాత. చైతన్య కొండ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్ను దర్శకుడు బాబీ విడుదలచేశారు. ఈ సందర్భంగా బాబీ మాట్లాడుతూ ట్రైలర్ బాగుందని, సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. నిర్మాత మాట్లాడుతూ ‘అరవై ఏళ్ల మహిళ ఇరవై ఏళ్ల యువకుడు ఎలా భార్యాభర్తలయ్యారనే పాయింట్తో రూపొందిస్తున్న చిత్రమిది. స్వచ్ఛమైన కుటుంబకథా చిత్రంగా తెరకెక్కిస్తున్నాం. సావిత్రి, సత్యమూర్తి జీవితాల్లో ఏం జరిగిందనేది ఆసక్తికరంగా ఉంటుంది. నిర్మాణానంతర కార్యక్రమాలు తుదిదశకు చేరుకున్నాయి. త్వరలో ఆడియోను విడుదలచేసి సినిమాను ప్రేక్షకలు ముందుకు తీసుకొస్తాం’ అని తెలిపారు. శివారెడ్డి, గౌతంరాజు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సత్యకశ్యప్, సినిమాటోగ్రఫీ: ఆనంద్ డోల.