కరోనా వైరస్ రెండో దశ కారణంగా మూడు నెలలుగా ఇండస్ట్రీలో ఒక్క సినిమా కూడా థియేటర్లో విడుదల కాలేదు. కేవలం ఓటీటీలో మాత్రమే విడుదల అవుతున్నాయి. వచ్చే సెప్టెంబర్ నుంచి మూడో దశ కూడా మొదలయ్యే అవకాశం ఉందని ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరించింది. ఇలాంటి సమయంలో థియేటర్లలో సినిమాలు విడుదల చేస్తే జనాలు వస్తారో ? లేదో తెలియట్లేదు. దీంతో థియేటర్లలో సినిమాలు విడుదల చేసేందుకు చాలామంది నిర్మాతలు సాహసించడం లేదు. కొంతమంది నిర్మాతలు మాత్రం ధైర్యంగా ముందడుగు వేస్తున్నారు. జూలై చివరి వారం నుంచి వరుసగా సినిమాలు విడుదల చేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలో అందరికంటే ముందుగా సత్యదేవ్ నటించిన తిమ్మరుసు సినిమాను జూలై 30న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు దర్శక నిర్మాతలు ప్రకటించారు.
కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదల అవుతున్న తొలి సినిమా ఇదేనంటూ పోస్టర్ ప్రకటించేశారు దర్శక నిర్మాతలు. నిఖిల్ కిరాక్ పార్టీ సినిమాను తెరకెక్కించిన శరణ్ కొప్పిశెట్టి.. తిమ్మరుసు సినిమాకు దర్శకుడు. ఈ సినిమా రిలీజ్ తర్వాత ఆగస్టు మొదటివారంలో చాలా సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వెంకటేశ్ నారప్ప, నాగచైతన్య లవ్ స్టోరీ, రానా విరాటపర్వం, నాని టక్ జగదీష్, గోపీచంద్ సీటీమార్ వంటి చిత్రాలను ఆగస్టులోనే విడుదల చేయాలని నిర్మాతలు ఆలోచిస్తున్నారు. వాటికి వచ్చే కలెక్షన్ల ఆధారంగా మిగిలిన నిర్మాతలు ఒక నిర్ణయం తీసుకోనున్నారు. ఏదేమైనా కూడా చాలా రోజుల తర్వాత సత్యదేవ్ థియేటర్లలోకి రాబోతున్నారు. మరి ఈ సారి పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
100 సార్లు నన్ను రిజెక్ట్ చేశారు..వారికి నా సమాధానమదే: దివి
మా ఎన్నికలు..ప్రకాశ్ రాజ్ ప్రశ్నకు నరేశ్ సెటైరికల్ రిప్లై
నో ఓటీటీ..సిల్వర్ స్క్రీన్ పైనే ‘నారప్ప’ సందడి..!
ఈ వీకెండ్ నెట్ఫ్లిక్స్ లో వస్తున్న తెలుగు సినిమాలివే..!
బంగార్రాజు చిత్రంలో ‘బేబమ్మ’..?