సత్యదేవ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘తిమ్మరుసు’. శరణ్ కొప్పిశెట్టి దర్శకుడు. ఈస్ట్కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేష్ కోనేరు, సృజన్ ఎరబోలు నిర్మిస్తున్నారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. యు.ఎ.సర్టిఫికెట్ లభించింది. ఈ నెల 30న విడుదల చేయబోతున్నారు. ‘ఈ సినిమాలో నిజాయితీపరుడు, తెలివైన లాయర్గా సత్యదేవ్ కనిపిస్తారు. న్యాయం కోసం ఎంత దూరమైన వెళ్లే వ్యక్తిగా ఆయన పాత్ర చిత్రణ శక్తివంతంగా ఉంటుంది. ఇటీవల విడుదలైన టీజర్కు అద్భుతమైన స్పందన లభిస్తోంది’ అని దర్శకుడు తెలిపారు. బ్రహ్మాజీ, అజయ్, ప్రవీణ్, ఆదర్శ్ బాలకృష్ణ, ఝాన్సీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: అప్పూ ప్రభాకర్, సంగీతం: శ్రీచరణ్ పాకాల, దర్శకత్వం: శరణ్ కొప్పిశెట్టి.