మహేష్బాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. పరశురామ్ దర్శకుడు. శనివారం ఫస్ట్ నోటీస్ పోస్టర్ను విడుదల చేశారు. ఇందులో మహేష్బాబు సరికొత్త కేశాలంకరణతో ైస్టెలిష్గా కనిపిస్తున్నారు. ఈ నెల 9న మహేష్బాబు జన్మదినోత్సవం సందర్భంగా బర్త్డే బ్లాస్టర్ను విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం తెలిపింది. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 13న ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. రైతు సమస్యలతో పాటు బ్యాంక్ కుంభకోణాల గురించి చర్చిస్తూ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఆర్. మది, ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, సంగీతం: తమన్, నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, నిర్మాణ సంస్థలు: మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, 14రీల్స్ ప్లస్, రచన-దర్శకత్వం: పరశురామ్.