బిగ్ బిస్ సీజన్ 5 వారం పూర్తి చేసుకుంది. 19 మంది కంటెస్టెంట్స్ హౌజ్లోకి ప్రవేశించగా, ఆదివారం ఊహించిన కంటెస్టెంట్నే ఎలిమినేట్ చేశారు. సరయు ఎలిమినేట్ అవుతుందని చెప్పుకు రాగా, ఆమెనే బిగ్ బాస్ హౌజ్ వీడింది. సరయు హౌజ్కి గుడ్ బై చెప్పాల్సి రావడంతో విశ్వ, హమీదాతో పాటు కొందరు కంటెస్టెంట్స్ చాలా ఎమోషన్ అయ్యారు.
స్టేజ్పైకి వచ్చిన సరయుని నాగార్జున గేమ్ ఆడించగా, ఆ గేమ్లో భాగంగా హౌస్లో 5 బెస్ట్, 5 వరస్ట్ కంటెంట్స్ చెప్పాలని అన్నాడు. శ్వేత, మానస్, ప్రియాంక, హమీదా, విశ్వ బెస్ట్ అని సిరి, షణ్ముఖ్, లహరి, సన్నీ, కాజల్ను వరస్ట్గా ఎంచుకుంది. అయితే వరస్ట్ కంటెస్టెంట్స్లో సిరి, సన్నీ , లహరిపై తెగ మండి పడింది.
సిరి, షణ్ముఖ్ ఒక స్ట్రాటజీతో వచ్చారని, బయటే అంతా ఫిక్స్ చేసుకుని వచ్చారని అభిప్రాయపడింది. ఆ తర్వాత సన్నీ గురించి చెప్తూ.. గతంలో ఆయనతో ఓ సినిమా చేశాను, అక్కడ జరిగిన చిన్న సంఘటన దగ్గర నుండి నా మీద కోపం పెంచుకున్నాడు. అందుకే నేను బయటకు వెళ్లేదాకా నిద్ర పోలేదు. దానికి స్పందించిన సన్నీఅలాంటింది ఏమి లేదు అని చెప్పగా, తాను పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ అని నాకు నీ మైండ్లో ఏముందో తెలుసని చెప్పుకొచ్చింది.
ఇక లహరిని కూడా ఫుల్ క్లాస్ పీకింది.అంత ఈగో ఏంటి? ఆ టోన్ మార్చుకో, ఎదగడానికి మనుషులను తొక్కాల్సిన అవసరం లేదు .. ‘ఏమీ లేని అరిటాకు ఎగిరెగిరి పడుతుందట, అని చెప్పి ఫుల్ ఫైర్ అయింది. నువ్వు కోపం లోఉన్నావు లే నేను అర్ధం చేసుకుంటా అంటూ లహరి చెప్పుకొచ్చింది. ఇక కాజల్ను కూడా వరస్ట్ కంటెస్టెంట్స్ లిస్టులో చేర్చిన సరయూ ఆమెను బుర్ర పెట్టి ఆడమని సలహా ఇచ్చింది. షణ్ముఖ్ని ఒకరిని కాపాడడం కోసం నీ ఆట ఆడకు అని తెలిపింది.
ఇక సండే కావడంతో నాగార్జున ఫన్ డే అంటూ ర్యాంప్ వాక్, ఒకరి మనసులో ఒకరికి ఏముందో అనేది చెప్పించాడు. ఈ ఆట చాలా సరదాగా సాగింది.