తెలంగాణ పోలీసుల గౌరవాన్ని మరింత పెంపొందించాలి
ప్రజల మన్ననలు పొందేలా విధులు నిర్వహించాలి
వీడియో కాన్ఫరెన్సులో డీజీపీ ఎం.మహేందర్రెడ్డి
మామిళ్లగూడెం, జూన్ 29: దేశంలో తెలంగాణ పోలీసులకు ఉన్న గౌరవాన్ని, కీర్తిని మరింత పెంపొందించే విధంగా పోలీసు అధికారులంతా మరింత ఉత్సాహంగా పనిచేయాలని డీజీపీ మహేందర్రెడ్డి సూచించారు. పోలీసు ఉన్నతాధికారులు, కమిషనర్లు, జిల్లాల ఎస్పీలతో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసుల విచారణ, దర్యాప్తు, కోర్టుల్లో శిక్షల శాతం, పెట్రోలింగ్ వాహనాల పనితీరు, స్టేషన్ రైటర్లు, రిసెప్షన్, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం తీసుకుంటున్న చర్యలతోపాటు వివిధ వర్టికల్స్ విభాగాల గురించి సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నేరాల నియం
త్రణ కోసం అన్ని స్థాయిల అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. పోలీసుల పట్ల ప్రజల్లో నమ్మకాన్ని మరింత పెంచేలా, వారి మన్ననలు పొందేలా విధినిర్వహణ చేయాలని సూచించారు. ఈ సందర్భంగా నేరాల నియంత్రణకు జిల్లాలో చేపట్టిన చర్యలను సీపీ విష్ణు వివరించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సైబర్ నేరాల పట్ల మరింత అవగాహన పెంపొదించుకోవడం లక్ష్యంగా రూపొందించిన ‘ఇన్వెస్టిగేటర్స్ డైరెక్టరీ ఫర్ సైబర్ వారియర్స్ 2.0’ పుస్తకాన్ని ఆయన ఆవిషరించారు. ఈ సందర్భంగా ఫంక్షనల్ వర్టికల్ అమలులో 2020-21లో ఉత్తమ ఫలితాలు సాధించిన 223 పోలీస్ స్టేషన్లకు, అధికారులకు అవార్డులు, పురసారాలను అందజేశారు. వీడియో కాన్ఫరెన్స్లో డీసీపీ ఇంజరాపు పూజ, అడిషనల్ డీసీపీలు సుభాశ్ చంద్రబోస్, ప్రసాద్, కుమారస్వామి, ఏఎస్పీ స్నేహా మెహ్రా , ఏసీపీ ప్రసన్నకుమార్ పాల్గొన్నారు.