సోషల్ మీడియా ప్రాచుర్యంలోకి వచ్చాక సెలబ్రిటీలపై ట్రోలింగ్ విపరీతంగా పెరిగింది. వారి డ్రెస్సింగ్పై,శరీరాకృతిపై విచ్చలవిడిగా కామెంట్స్ చేస్తున్నారు.తాజాగా పవన్ కల్యాణ్ ‘బంగారం’ మూవీతో తెలుగు తెరకు పరిచమైన సనూషపై నెటిజన్స్ అసభ్యమైన పోస్ట్లు పెట్టారు. దీనికి ఆమె ఘాటుగానే స్పందించింది.సనూష ..రేణిగుంట’, ‘జీనియస్’ వంటి చిత్రాల్లో హీరోయిన్గా నటించగా, నాని నటించిన జెర్సీ చిత్రం జర్నలిస్ట్ పాత్ర పోషించింది.
ఇటీవల సనూష ఫిట్నెస్పై దృష్టి పెట్టి నాజూగ్గా తయారైంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీనిపై నెటిజన్స్ చెత్త కామెంట్స్ చేయడంతో కోపోద్రిక్తురాలైన సనూష.. నా శరీర బరువు గురించి నా కన్నా ఎక్కువగా బాధ పడే వారికి ఒక్కటే చెబుతున్నాను. ఎదుటి వాళ వైపు వేలెత్తి చూపిస్తే మిగిలిన వేళ్లు మిమ్మల్ని చూపిస్తాయని గుర్తు పెట్టుకొండి. ఎదుటి వారిని అనే ముందు మీరు ఎంత పర్ఫెక్ట్గా ఆలోచించుకోండి అని స్టన్నింగ్ కామెంట్స్ పెట్టింది.