‘ఘాజీ’, ‘అంతరిక్షం’ సినిమాలతో దర్శకుడిగా ప్రతిభను చాటుకున్నారు సంకల్ప్రెడ్డి. తాజాగా ఆయన బాలీవుడ్లో అరంగేట్రం చేయబోతున్నారు. ‘ఐబీ 71’ పేరుతో ఓ హిందీ చిత్రాన్ని సంకల్ప్రెడ్డి తెరకెక్కించనున్నారు. గూఢచర్యం నేపథ్యంలో థ్రిల్లర్ కథాంశంతో ఈ చిత్రం రూపుదిద్దుకోనున్నది. విద్యుత్ జమ్వాల్ కథానాయకుడిగా నటిస్తూ రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యథార్థ ఘటనలతో ప్రయోగాత్మకంగా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు చెబుతున్నారు. త్వరలో ఈ చిత్రం సెట్స్పైకి రానున్నది.