మిర్యాలగూడ, జూలై 9 : రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పట్టణ, పల్లె ప్రగతి పనులు ఉద్యమంలా కొనసాగుతున్నాయి. ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి భాగస్వాములవుతున్నారు. మిర్యాలగూడ మండలం యాద్గార్పల్లి, సుబ్బారెడ్డిగూడెంలో మొక్కలు నాటారు. హట్యాతండా, దుబ్బతండా, జంకుతండా, దొండవారిగూడెంలో ఎంపీడీఓ దేవిక పల్లె ప్రగతి పనులను పరిశీలించారు. అడవిదేవులపల్లి, వేములపల్లి మండలాల్లో ప్రత్యేకాధికారులు నరేందర్ మక్బూల్ అహ్మద్ పల్లెప్రగతి పనులను పరిశీలించి మొక్కలు నాటారు.
దామరచర్ల మండలంలోపర్య్తూనాయక్తండాలో ఆర్డీఓ రోహిత్సింగ్, ప్రత్యేకాధికారి నాగమణి పల్లె ప్రకృతివనం, వైకుంఠధామాల ఏర్పాటు కోసం స్థలాన్ని పరిశీలించారు. మాడ్గులపల్లి ఇందుగుల నర్సరీని డీపీఓ విష్ణువర్ధన్రెడ్డి పాములపహాడ్, చిరుమర్తి, పోరెడ్డిగూడెం గ్రామాల్లో ప్రత్యేకాధికారి నాగేశ్వర్రావు పల్లె ప్రగతి పనులు పరిశీలించారు. కార్యక్రమాల్లో ఎంపీపీలు నూకల సరళాహన్మం ంతరెడ్డి, బాలాజీ, ఎంపీడీఓ మసూద్షరీఫ్, సర్పంచులు చిర్ర మల్లయ్యయాదవ్, ప్రి యాంక, నాగలక్ష్మి, ఆనంద్, కిరణ్, వరలక్ష్మి, కోటిరెడ్డి, లక్ష్మి, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.
నాగార్జున సాగర్ నియోజకవర్గంలో..
హాలియా : హాలియా, నందికొండ మున్సిపాలిటీ వార్డుల్లో మురుగు కాల్వలను శుభ్రం చేయడంతో పాటు రోడ్డుకు ఇరువైపులా పిచ్చి మొక్కలు తొలగించారు. అనుముల మండలం కొత్తపల్లి, పంగవానికుంట, పంగవానికుంట తండా, పులిమామాడి, శ్రీనాథపురం, పాలెం, చింతగూడెం గ్రామాల్లో రోడ్డు వెంట మొక్కలు నాటారు. పెద్దవూర మండలం వెల్మగూడెం, చింతపల్లి, బట్టుగూడెం, పులిచర్ల, కేకే తండా, తిరుమలగిరి సాగర్ మండలంలో నాగార్జున పేట, జమ్మనకోట, సుంకిశాలతండా, గాత్తండా, రంగుండ్ల, త్రిపురారం మండలంలో కంపాలపల్లి, లచ్చతండా, వస్రాంతండా, చెన్నాయిపాలెం, గుర్రంపోడు మం డలం సుల్తాన్పురం, వెంకటాపురం, మక్కపల్లి, బ్రాహ్మణగూడెం, కాచారం, పాశంవారిగూడెం గ్రామాల్లో పారిశుధ్య పనులు చేపట్టారు. నీరు నిల్వ ఉన్న దగ్గర బ్లీచింగ్ పౌడర్ చల్లారు. నిడమనూరు మండలం వల్లభాపురం, నారమ్మగూడెం, రేగులగడ్డ గ్రామాల్లో ప్రత్యేకాధికారి కాళిందిని మొక్కలు నాటడంతో పాటు రోడ్డుకు ఇరువైపులా ఉన్న పిచ్చిచెట్లను తొలగించారు. మంచినీటి ట్యాంకులను శుభ్రం చేశా రు. కార్యక్రమాల్లో ఎంపీపీ పేర్ల సుమతి, ఎంపీడీఓ లక్ష్మి, ఎంపీఓ భిక్షం రాజు, ప్రమోద్కుమార్, పల్లెబోయిన రామలింగయ్య, రావుల శ్రీనుయాదవ్, చామకూరి చిన లింగారెడ్డి, దాసరి సైదమ్మ, సుంకిరెడ్డి ప్రభావతీసంజీవ రెడ్డి, బాణావత్ శంకర్నాయక్, భిక్షపతి, సుధాకర్, పాశం గోపాల్రెడ్డి, పాల్గొన్నారు.
దేవరకొండ నియోజకవర్గంలో..
దేవరకొండ : దేవరకొండ పట్టణంలోని పలు వార్డుల్లో పట్టణ ప్రగతి పనులు చేపట్టారు.ఖాళీ ప్రదేశాల్లో పిచ్చి మొక్కలను తొలగించారు. మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య ఆధ్వర్యంలో ప్రధాన రహదారి వెంట మొక్కలు నాటారు.దేవరకొండ మండలం ఇద్దంపల్లి, జిల్లపల్లి గ్రామాల్లో పల్లెప్రగతి పనులను ఆర్డీఓ గోపీరాం పరిశీలించారు. చింతపల్లి మం డలం తీదేడు, కుర్మేడు, శాయిరెడ్డి గూడెం గ్రామాల్లో ఇంటింటికీ ఆరు మొక్కలు పంపిణీ చేశారు. పలు గ్రామాల్లో చెత్త తొలగించారు. డిండి జీవ వైవిధ్య కమిటీ ఆధ్వర్యంలో ఎంపీపీ మాధవరం సునీతాజనార్దన్రావు మొక్కలు నాటారు. పీఏపల్లి మండలంలో వివిధ గ్రామాల్లో మొక్కలు నాటారు. ఎంపీడీఓ గిరిబాబు, రాజు, ప్రత్యే కాధికారి శ్రీనివాస్రావు, వైస్ ఎంపీపీ పుల్లమ్మ, సర్పంచ్ మేకల సాయమ్మ, వైద్యాధికారి పరశురాం, ఏపీఓ శౌరిరెడ్డి, కాయితి జితేందర్రెడ్డి, రవీందర్గౌడ్, ప్రత్యేకాధికారి జాఫర్అలీ, నాగరాజు పాల్గొన్నారు.