సంపూర్ణేష్బాబు, మహేశ్వర వద్ది జంటగా నటిస్తున్న చిత్రం ‘బజార్ రౌడీ’. వసంత నాగేశ్వరరావు దర్శకుడు. సందిరెడ్డి శ్రీనివాసరావు నిర్మించారు. ‘నీ వంటికి మెరుపులు బాగా చుట్టేశావే..నా కంటికి రంగులు ఏవో చూపించావే..పిల్లా నా మతి చెడగొట్టావే’ అనే గీతాన్ని సోమవారం చిత్రబృందం విడుదలచేసింది. గణేష్ సాహిత్యాన్ని అందించిన ఈ గీతాన్ని దత్తు, పల్లవి ఆలపించారు. నిర్మాత మాట్లాడుతూ ‘ప్రియురాలి అందాన్ని వర్ణిస్తూ ప్రేమికుడు ఆలపించే గీతమిది. సంపూర్ణేష్, మహేశ్వరిలపై అందంగా చిత్రీకరించాం. ఈ పాట సినిమాకు ప్రధానాకర్షణగా నిలుస్తుంది. కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టగానే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’ అని తెలిపారు. నాగినీడు, షయాజీషిండే, పృథ్వీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: మరుధూరి రాజా,