మల్లాపూర్, ఏప్రిల్ 4 : కరోనాను కట్టడి చేసేందుకు జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం సిరిపూర్లో గ్రామస్థులు స్వచ్ఛంద లాక్డౌన్ విధించుకున్నారు. ఆదివారం సర్పంచ్ భూక్యా గోవింద్నాయక్ ఆధ్వర్యంలో పంచాయతీ పాలకవర్గం ప్రత్యేకంగా సమావేశమై.. గ్రామంలో లాక్డౌన్ అమలు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించింది. గ్రామంలో హెయిర్ కటింగ్షాపులు, హోటళ్లు ఈనెల 15 వరకు మూసివేయాలని సర్పంచ్ సూచించారు. కిరాణ, ఇతర దుకాణాలు ఉదయం 6 నుంచి ఉదయం 10 వరకు, సాయంత్రం 6 నుంచి రాత్రి 9 వరకు మాత్రమే తెరిచి ఉంచాలన్నారు. ప్రతి ఒక్కరూ నిర్ణీత దూరం పాటిస్తూ విధిగా మాస్క్ ధరించాలని, లేనిపక్షంలో రూ.వెయ్యి జరిమానా విధిస్తామని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..