నాగ చైతన్య నుండి విడిపోతున్నట్టు సమంత ప్రకటించినప్పటి నుండి ఆమెనే టార్గెట్ చేస్తూ కొందరు విమర్శలు చేస్తున్నారు.ఎఫైర్ అని కొందరు, సినిమాల కోసమని మరి కొందరు ఇలా ఏవేవో కారణాలతో సమంతని టార్గెట్ చేస్తూ విమర్శిస్తున్నారు.ఈ క్రమంలో మాధవీ లత వంటి వారకు సమంతకు సపోర్ట్గా నిలుస్తూ వచ్చారు.అయినప్పటికి ఆరోపణలు ఆగడం లేదు. ఈ క్రమంలో సమంత తన ఇన్స్టాగ్రామ్ ద్వారా సమాజం మగాళ్లని ఎందుకు ప్రశ్నించదు అనే కామెంట్ పెట్టి హాట్ టాపిక్గా మారింది.
సమంత తాజాగా తన మనసులోని బాధను బహిర్గతం చేస్తూ ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ షేర్ చేసింది. మహిళలను ప్రశ్నిస్తూ ఉండే సమాజం, మగళవాళ్లను ఎందుకు ప్రశ్నించదు. అంటే మనకు ప్రాథమికంగా నైతికత లేనట్టేనా అని గుడ్ మార్నింగ్ చెబుతూ కొటేషన్ పెట్టింది. చైతూ నుండి దూరమయ్యాక సమంత లోలోపల చాలా బాధపడుతున్నట్టు తెలుస్తుంది. ఓ యాడ్ షూటింగ్లో పాల్గొన్న ఆమె షాట్ గ్యాప్లో కంటతడి పెట్టుకున్నట్లు సమాచారం.
పెళ్లి తర్వాత వరుస సినిమాలతో అలరించిన సమంత.. ఇటీవలే ‘శాకుంతలం’ మూవీ కంప్లీట్ చేసింది. ఆమె కెరీర్లో రాబోతున్న తొలి పౌరాణిక సినిమా ఇదే కావడం విశేషం. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ భారీ సినిమాను అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. దీంతో పాటు ‘కాతు వక్కుల రెందు కాదల్’ అనే తమిళ సినిమా చేస్తోంది సమంత.