రామంతాపూర్/ఉప్పల్, జూలై 8 : ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. చిలుకానగర్ డివిజన్లో నిర్వహించిన పట్టణ ప్రగతిలో భాగంగా ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ పలు కాలనీల్లో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. పలు చోట్ల మొక్కలు నాటి, శ్రమదానం చేశారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరిస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు. సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడకుండా అధికారులు సత్వరమే స్పందిస్తూ ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీ అరుణకుమారి, ఈఈ నాగేందర్, పలు శాఖల అధికారులతో పాటు టీఆర్ఎస్ నాయకులు గడ్డం రవికుమార్, పల్లె నర్సింగ్రావు, కొండల్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
నాచారంలోని భవానీనగర్లో నిర్వహించిన పట్టణ ప్రగతిలో కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్, పలువురు అధికారులు పర్యటించి స్థానిక సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మధుసూదన్రెడ్డి, సత్యనారాయణ, రమేశ్, సుధాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చర్లపల్లి : చర్లపల్లి డివిజన్ను స్వచ్ఛ డివిజన్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని కార్పొరేటర్ బొంతు శ్రీదేవి పేర్కొన్నారు. డివిజన్ పరిధిలోని విద్యామారుతీనగర్, అయ్యప్పకాలనీ, మధుసూదన్రెడ్డినగర్, వెంకటరెడ్డినగర్ తదితర ప్రాంతాల్లో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా గురువారం ఆమె ఏఈ సత్యలక్ష్యితో కలిసి పర్యటించారు. మొక్కలు నాటి, పారిశుధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. డివిజన్లో పారిశుధ్య సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని, తడి, పొడి చెత్తపై కాలనీవాసులకు అవగాహన కల్పించి చెత్తను సేకరించే సిబ్బందికి మాత్రమే అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఆవరణలో మొక్కలు నాటి సంరక్షించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని ఆమె సూచించారు. డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో నాయకులు ప్రభుగౌడ్, భానుచందర్, ధనుంజయ్యగౌడ్, రాజు, రఘుపతి, రమేశ్, సతీశ్, శ్రీకాంత్యాదవ్, శ్రీకాంత్, పెంటేశ్, నర్సిరెడ్డి, యాదగిరి, వెంకట్రెడ్డి, మహేందర్, కరుణాకర్, సత్తమ్మ, నర్సింహ, మహేశ్, శంకర్, మల్లయ్య, రాజిరెడ్డి, మల్లేశ్, సుధాకర్రెడ్డి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
రామంతాపూర్ : పట్టణ ప్రగతిలో భాగంగా గురువారం రామంతాపూర్ డివిజన్లోని అరవింద్నగర్, గాంధీనగర్, జనప్రియ తదితర ప్రాంతాల్లో స్థానిక కార్పొరేటర్ బండారు శ్రీవాణి, అధికారులు పర్యటించారు . ఈ సందర్భంగా స్థానికులు పలు సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చారు. తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ తదితర సమస్యల పరిష్కారానికి తాను కృషి చేస్తున్నానని కార్పొరేటర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి రాజు, ఏఈ విఘ్నేశ్వరి, డీజీఎం శ్రీధర్రెడ్డి, కిషన్, కఠారియా, స్థానికులు చెన్నయ్య, శశిధర్, నవీన్, శ్రీనివాస్రెడ్డి, బీజేపీ డివిజన్ అధ్యక్షుడు బండారు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
హబ్సిగూడ డివిజన్ గోఖలేనగర్, గణేశ్నగర్ తదితర ప్రాంతాల్లో గురువారం నిర్వహించిన పట్టణ ప్రగతిలో కార్పొరేటర్ కక్కిరేణి చేతన హరీశ్ పాల్గొన్నారు. స్థానిక కాలనీ వాసులు పలు సమస్యలను కార్పొరేటర్ దృష్టికి తెచ్చారు. ఈ కార్యక్రమంలో డీఈ నాగమణి, కిషన్, కఠారియా, స్థానికులు విద్యాసాగర్రెడ్డి, నాగేంద్ర, నితిన్ పటేల్, బీజేపీ నాయకులు ఎల్లాచారి, లతారెడ్డి, వెంకట్రెడ్డి, వెంకటేశ్గుప్తా తదితరులు పాల్గొన్నారు.
మల్లాపూర్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మీర్పేట్- హెచ్బీకాలనీ డివిజన్ కార్పొరేటర్ జె. ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ జి. శ్రీనివాస్రెడ్డి గురువారం రాజీవ్నగర్, ఇందిరానగర్ ఫేజ్-1, నవోదయనగర్, తదితర కాలనీల్లో పర్యటించారు. నీటి సమస్య, విద్యుత్, బోరు మోటారు రిపేర్ వంటి పలు సమస్యలను స్థానికులు కార్పొరేటర్కు విన్నవించారు. పట్టణ ప్రగతి కార్యక్రమం అనంతరం సంబంధిత అధికారులతో సమావేశమై సమస్యలను పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో ఏఈ తిరుమలయ్యగౌడ్, వర్క్ ఇన్స్పెక్టర్ చారి, యాకస్వామి, లక్ష్మి, నర్సయ్య, నాయకులు బాల్రాజ్, అశోక్, జైపాల్, ఐలయ్య, భాగ్యమ్మ, నవీన్గౌడ్, బాల్నర్సింహ, శేఖర్గౌడ్, జ్యోతి, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
చర్లపల్లి : ఏఎస్రావునగర్ డివిజన్ పరిధిలో నెలకొన్న డ్రైనేజీ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని కార్పొరేటర్ శిరీషాసోమశేఖర్రెడ్డి పేర్కొన్నారు. కమలానగర్లో గురువారం నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో కార్పొరేటర్, ఏఈ సంతోష్కుమార్ పాల్గొన్నారు. స్థానికుల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపడుతున్నామని కార్పొరేటర్ అన్నారు. డివిజన్లో మొక్కలు నాటడంతోపాటు పారిశుధ్య పనులను పరిశీలిస్తున్నామన్నారు. నాలాలను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఏ అంజలి, నాయకులు సోమశేఖర్రెడ్డి, నాను, రామిరెడ్డి, బాబుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.