సిటీబ్యూరో, జూన్ 19 (నసమ్తే తెలంగాణ): హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో చేపట్టిన ఔటర్ రింగు రోడ్డుపై ఇంటర్ చేంజ్ల నిర్మాణానికి హెచ్ఎండీఏ కమిషనర్ చొరవ ప్రశంసనీయమని ఎంపీ రంజిత్ రెడ్డి ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ ట్వీట్ను చూసిన పలువురు నగర వాసులు నానక్రాంగూడ,నార్సింగిల మధ్య ఉన్న మైహోం అవతార్ నుంచి ల్యాంకో హిల్స్ వరకు లింకు రోడ్డును నిర్మించాలని, అదేవిధంగా మణికొండ మీదుగా ఓఆర్ఆర్ వరకు నిర్మిస్తున్న రేడియల్ రోడ్డు 5ను త్వరగా పూర్తి చేయాలని హెచ్ఎండీఏ కమిషనర్కు రీట్విట్ చేశారు.