అక్కినేని కోడలు సమంత వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో శ్రీ వారిని దర్శించుకుంది. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం పలకగా.. ఆలయ అధికారులు స్వామి వారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం చిత్తూరు జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీ కాళహస్తీశ్వర దేవాలయాన్ని దర్శించుకున్నారు.
మహాన్యాస ఏకాదశి రుద్రాభిషేకం పూజలో పాల్గొన్న సమంత స్వామివారిని, అమ్మవారిని దర్శించుకున్నారు. సమంత ఒక్కరు దైవ దర్శనానికి వెళ్లింది. గత కొద్ది రోజులుగా సమంత- నాగ చైతన్య విడాకులకి సంబంధించి జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సమంత పలు పూజలు చేయించుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
సమంత ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్లు చేస్తూ బిజీగా ఉంది.ది ఫ్యామిలీ మ్యాన్2 వెబ్ సిరీస్లో నెగెటివ్ రోల్ పోషించి మంచి మార్కులు కొట్టేసింది. ఇక రీసెంట్గా గుణశేఖర్ తెరకెక్కించిన శాకుంతలం చిత్ర షూటింగ్ పూర్తి చేసింది. ప్రస్తుతం విఘ్నేష్ శివన్ డైరెక్షన్లో రూపొందుతున్న సినిమాలో నటిస్తుంది. మరో వైపు నెట్ఫ్లిక్స్ కోసం ఓ వెబ్ సిరీస్ చేస్తున్నట్టుగా సమాచారం.