తొర్రూరు, జూన్ 8 : కరోనా కష్టకాలంలో బాధితులకు అండగా నిలవాలని మహాత్మా హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ వ్యవస్థాపకుడు గంటా రవీందర్ అన్నారు. మండలంలోని ఫత్తేపురం గ్రామంలో మంగళవారం సంస్థ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కరోనాతో ఇటీవల మృతి చెందిన ఆర్ఎంపీ దండె కృష్ణ కుటుంబానికి నిత్యావసర సరుకులు, బియ్యం, ఇతర వస్తువులు అందజే శారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్థ ఆధ్వ ర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు సరుకులు పంపిణీ చేస్తు న్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రతినిధులు డీ అబ్బ య్య, దిలీప్, మణికంఠ, భానుప్రకాశ్, శ్రీజ పాల్గొన్నారు.
కరోనా బాధితులు పౌష్టికాహారం తీసుకోవాలి
మరిపెడ, జూన్ 8: కరోనా బాధితులను వివక్షకు గురి చేయొద్దని మున్సిపల్ చైర్ పర్సన్ జీ.సింధూరి అన్నారు. మున్సిపల్ కేంద్రంలోని పలు కాలనీల్లో కరోనా బాధితు లను పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ అరుణతో కలిసి బా ధితులను పరామర్శించారు. ప్రతి ఒక్కరూ పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గణేశ్, కౌన్సిలర్లు గుగులోత్ వస్రాం, పానుగోత్ వెంకన్న, దేవరశెట్టి శ్రీలత, మాచర్ల భద్రయ్య పాల్గొన్నారు.
రఘు కుటుంబానికి చేయూత
కరోనాతో మృతిచెందిన అజ్మీరా రఘు కుటుంబాన్ని సర్పంచ్ అజ్మీరా బేబిరెడ్డి నాయక్, మరిపెడ అంగన్వాడీ సూపర్వైజర్ నీరజ పరామర్శించి బియ్యం, నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. మృతుడికి ముగ్గురు కూతుళ్లు ఉన్నారని, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.
కరోనా నియంత్రణే ప్రభుత్వ ధ్యేయం : ఎంపీపీ
కరోనా నియంత్రణకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎంపీపీ గుగులోత్ అరుణ అన్నారు. మండలంలోని లచ్చతండ, మరిపెడ గ్రామాల్లోని క్రొవి డ్ నిర్ధారణ కేంద్రాలను ఆమె పరిశీలించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమ న్వయంతో పనిచేసి వైరస్వ్యాప్తికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో సమ్మయ్య, వెంకటేశ్వర్లు, రాములమ్మ, అరుణ, నాగమణి పాల్గొన్నారు.
వైద్యుల సలహాలు పాటించాలి
నర్సింహులపేట, జూన్ 8 : కరోనా బాధితులు వైద్యుల సలహాలు పాటించాలని మండల ప్రత్యేకాధికారి, డీఈవో సోమశేఖరశర్మ అన్నారు. మంగళవారం మండలం లోని జయపురం గ్రామంలో కరోనా బాధితులకు సతే సూచనలు చేశారు. ఏఎన్ఎంలు, ఆశవర్కర్లు జ్వరం, శ్వాసకు సంబంధిత పరీక్షలు నిర్వహించి ఏవైనా సమస్య లుంటే వైద్యాధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమం లో తహసీల్దార్ ఇమ్మానియేల్, ఎంపీడీవో సత్యనారా యణరెడ్డి, సర్పంచ్ మందుల యాకన్న, ఎంపీవో సోం లాల్, ఏఎన్ఎం విజయ, అంగన్వాడీ టీచర్లు, అశ కార్య కర్తలు, పంచాయతీ సిబ్బంది ఉన్నారు.
ఐసోలేషన్ కేంద్రానికి తరలింపు
పెళ్లికి వెళ్లివచ్చిన ఇద్దరు వ్యక్తుల కారణంగా 15 మందికి కరోనా సోకడంతో మండల కేంద్రంలోని ఐసోలేషన్ కేంద్రానికి మంగళ వారం తరలించారు. మండలంలోని గోల్బోడ్కతండా గ్రామ పంచాయతీ పరిధి లోని చర్లచంద్రుతండాకు చెందిన ఇద్దరు వ్యక్తులు హన్మకొండలో జరిగిన వివాహానికి వెళ్లారు. కొద్ది రోజుల తర్వాత వారికి జ్వరం, దగ్గు వస్తుండటంతో కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వీరితో పాటు 15 మందికి పాజిటివ్ రిపోర్టు రావడంతో స్థానిక ఐసొలేషన్ కేంద్రానికి తరలించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఇమ్మానియే ల్, ఎంపీడీవో సత్యనారాయణరెడ్డి, ఎంపీవో సోంలాల్, కిషన్నాయక్, పంచాయతీ కార్యదర్శి సాత్విక్, అశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
పెద్దవంగర, జూన్ 8 : కరోనా వేళ ప్రజలు అప్రమ త్తంగా ఉంటూ కరోనా కట్టడికి సహకరించాలని తహసీల్దార్ యోగేశ్వర్రావు అన్నారు. మంగళవారం మండలంలోని కాన్వాయిగూడెం జీపీలో సర్పంచ్ మద్దెల కరుణ అధ్యక్షత న గ్రామస్థాయి అధికారులు, ఆశకార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరిస్తూ, భౌతిక దూరం పాటించేలా చూడాలన్నారు. కార్యక్రమంలో ఎంపీవో యాకయ్య, ఆర్ఐ సాయిబాబా, ఉపసర్పంచ్ చంద్రయ్యగౌడ్, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.