బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ఖాన్ సినిమాలతోపాటు సామాజిక సేవలో కూడా ముందుంటాడని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సారి కూడా సొసైటీకి మేలు చేసే మంచి నిర్ణయం తీసుకున్నాడు. సల్లూభాయ్ నటిస్తోన్న కొత్త చిత్రం రాధే..యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్. మే 13న థియేటర్లతోపాటు జీప్లెక్స్ లో విడుదలవుతుంది. మేకర్స్ ఇప్పటికే జీప్లెక్స్ లో టికెట్ ధర రూ.299 గా నిర్ణయించారు.
రాధే చిత్రానికి మంచి కలెక్షన్లు వస్తాయని ధీమాగా ఉన్నాడు సల్మాన్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. కోవిడ్ బాధితులకు అండగా నిలిచేందుకు రాధే చిత్రానికి వచ్చే కలెక్షన్లలో సగం నగదును కోవిడ్ బాధితుల కోసం ఖర్చు చేయాలని డిసైడ్ అయ్యాడట సల్మాన్. రీల్ హీరో కాకుండా రియల్ హీరో అనిపించుకుంటున్న సల్మాన్ఖాన్ డెసిషన్ కు సలామ్ కొట్టాల్సిందే.
ఇవి కూడా చదవండి..
ఆర్య@17.. బన్నీ ఎమోషనల్ ట్వీట్
పవన్ కల్యాణ్ హీరోయిన్ సెల్ఫ్ ప్రమోషన్
అనసూయ థ్యాంక్ యు బ్రదర్ ఎలా ఉంది…?
భయం వీడి..వాక్సిన్ వేయించుకున్న పాయల్
జాన్వీ గ్లామర్ షోకు షేక్ అవుతున్న సోషల్ మీడియా
ఓటీటీ షోకు ఇలియానా గ్రీన్ సిగ్నల్..?
మీరెంత ధనవంతులనేది కాదు విషయం : రాంగోపాల్ వర్మ