రాధే సినిమాపై రివ్యూ ఇచ్చిన కమాల్ ఆర్ ఖాన్ పై బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ముంబై కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఈ మేరకు సల్మాన్ ఖాన్ లీగల్ టీం కమాల్ ఆర్ ఖాన్ కు నోటీసులు పంపించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ కమాల్ ఆర్ ఖాన్ ట్వీట్ చేశాడు. రాధే రివ్యూ విషయంలో సల్మాన్ ఖాన్ నాపై పరువు నష్టం దావా వేశాడు అని ట్వీట్ లో పేర్కొన్నాడు.
సినిమా నిర్మాత, నటుడు కానీ నన్ను రివ్యూ ఇవ్వొద్దంటే ఇవ్వనని నేను చాలా సార్లు చెప్పాను. సల్మాన్ ఖాన్ నా రివ్యూ మీద పరువునష్టం దావా వేశారు. నా రివ్యూ వల్ల సల్మాన్ పై చాలా ఎఫెక్ట్ పడ్డదనుకుంటా. ఇకనుంచి సల్మాన్ ఖాన్ సినిమాలకు రివ్యూలు ఇవ్వను. నా చివరి వీడియో నేడు విడుదల చేస్తున్నా అని కమాల్ ఆర్ ఖాన్ సందేశాన్ని పోస్ట్ చేశాడు. అత్యవసర ప్రాతిపదికన ఈ విషయంపై సిటీ సివిల్కోర్టులో గురువారం విచారణ చేయాలని సల్మాన్ ఖాన్ లీగల్ టీం కోరింది.
బాలకృష్ణ నుంచి సర్ప్రైజ్ అనౌన్స్ మెంట్?
పవన్-రానా కోసం ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్..?
శ్రీదేవి చిన్న కూతురు టాలీవుడ్ ఎంట్రీ..!
గూని పాత్రలో రావు రమేశ్..ఇంట్రెస్టింగ్గా ఫస్ట్ లుక్
నటి ఇంట్లో గన్, కత్తితో వ్యక్తి హల్చల్
రాధేశ్యామ్ టీం మరో పాటను షూట్ చేయనుందా..?
సలార్ లో స్టార్ హీరో భార్య పవర్ ఫుల్ రోల్..?