‘సలార్' మొదలైంది

హీరో ప్రభాస్ జోరుమీదున్నారు. వరుసగా సినిమాల్ని సెట్స్పైకి తీసుకొస్తున్నారు. ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సలార్' శుక్రవారం హైదరాబాద్లో లాంఛనంగా ప్రారంభమైంది. ప్రశాంత్నీల్ (‘కేజీఎఫ్' ఫేమ్)దర్శకుడు. హోంబలే ఫిలింస్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. ప్రారంభోత్సవ వేడుకకు కర్ణాటక డిప్యూటి సీఏం అశ్వత్ నారాయణ్, కన్నడ అగ్ర హీరో యష్, నిర్మాతలు, దిల్రాజు, దానయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ‘నాకు అవకాశం ఇచ్చిన నిర్మాత విజయ్ కిరగందూర్, ప్రభాస్కు ధన్యవాదాలు. యష్ ఈ రోజు మాతో ఉండటం ఆనందాన్ని కలిగించింది. ‘సలార్' మిమ్మల్ని నిరాశపరచదు’ అని ప్రశాంత్ నీల్ ట్విటర్ ద్వారా పేర్కొన్నారు. భారీ బడ్జెట్తో యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రభాస్ ఈ సినిమాలో సరికొత్త పంథాలో కనిపించబోతున్నట్లు తెలిసింది.
తాజావార్తలు
- ఒకే స్కూళ్లో 190 మంది విద్యార్థులకు కరోనా
- ఆర్ఎస్ఎస్ కార్యకర్త హత్య.. కేరళలో బంద్
- నగ్నంగా ఉన్న ఫొటో అడిగిన నెటిజన్.. షేర్ చేసిన శ్రీముఖి
- మణిపూర్లో స్వల్ప భూకంపం
- ఆందోళన కలిగిస్తున్న కరోనా.. దేశంలో పెరుగుతున్న కేసులు
- మహిళ గుండెతో కూర.. దంపతులకు వడ్డించి హత్య
- ఢిల్లీలో పెరిగిన కాలుష్యం
- పవన్ కళ్యాణ్తో బిగ్ బాస్ బ్యూటీ సెల్ఫీ.. పిక్స్ వైరల్
- ఎన్టీపీసీలో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగాలు
- దుబాయ్లో బన్నీ ఫ్యామిలీ హల్చల్