సిటీబ్యూరో, జూలై 6 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం నిషేధించిన పొగాకు ఉత్పత్తులను కొందరు వ్యాపారులు గుట్టు చప్పుడు కాకుండా విక్రయిస్తున్నారు. గుట్కా, పాన్ మాసాలలు, ఖైనీ, వివిధ పేర్లతో పొగాకు ఉత్పత్తులను పాన్షాపులు, కిరాణా దుకాణాల్లో విక్రయాలు సాగిస్తున్నారు. అయితే.. వాటిపై హైదరాబాద్ పోలీసులు నిఘా పెట్టి… తనిఖీలు చేపట్టి అక్రమంగా విక్రయించేవారిని అరెస్ట్ చేస్తున్నారు. అలాగే.. ప్రజల ఆరోగ్యాలకు హానికరమైన ఉత్పత్తులను విక్రయించడం వల్ల కలిగే నష్టాల గురించి పాన్ డబ్బా లు, కిరాణా దుకాణాల నిర్వాహకులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇతర రాష్ర్టాల నుంచి గుట్కా, జర్ధా, వివిధ రకాలైన పొగాకు ఉత్పత్తులను కొందరు వ్యాపారులు హైదరాబాద్కు తరలిస్తున్నారు. శివార్లలోని గోడౌన్లలో డంప్చేసి.. అక్కడి నుంచి నగరంలోని దుకాణాలకు సరఫరా చే స్తున్నారు. దీనిపై నిఘా పెట్టిన పోలీసులు.. ఇక నిషేధిత ఉత్పత్తులను విక్రయించవద్దని వారికి అవగాహన కల్పిస్తున్నారు.