హైదరాబాద్: తెలంగాణలో కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పడుతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 2,070 మందికి కొవిడ్ పాజిటివ్గా తేలింది. కరోనా నుంచి 3,762 మంది బాధితులు కోలుకోగా,
మరో 18 మంది మృతిచెందారు. ఇవాళ 1,38,182 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 29,208 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.