పెసరపప్పు: ఒక కప్పు, బెల్లం: ఒక కప్పు, పల్లీలు: పావు కప్పు, తరిగిన బాదం, జీడిపప్పు, పిస్తా: అరకప్పు, యాలకుల పొడి: అర టీస్పూన్, నెయ్యి: అరకప్పు, ఎండు కొబ్బరి: ఒక టేబుల్ స్పూన్
తయారీ విధానం
స్టవ్మీద గిన్నె వేడయ్యాక పెసరపప్పు, పల్లీలు విడివిడిగా దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత రెండిటినీ విడివిడిగా మెత్తగా పొడి చేసుకోవాలి. స్టవ్మీద కడాయి పెట్టి, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడయ్యాక డ్రైఫ్రూట్స్, కొబ్బరి వేసి బాగా వేయించి పక్కన పెట్టాలి. ఇప్పుడు మందపాటి గిన్నెపెట్టి బెల్లం వేసి, కొంచెం నీళ్ళుపోసి తీగపాకం వచ్చేదాకా తిప్పుతూ ఉండాలి. బెల్లం ఉండపాకం వచ్చాక పెసరపప్పు, పల్లీల పొడులు, వేయించిన డ్రైఫ్రూట్స్, యాలకుల పొడి, మిగతా నెయ్యి వేసి దగ్గరపడేవరకు కలుపుతూ ఉండాలి. బాగా దగ్గరపడిన తర్వాత మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకొని లడ్డూలు చేసుకుంటే ఎంతో ఆరోగ్యకరమైన మిఠాయి రెడీ.