కరోనా వలనో లేదంటే ఇతర ఆరోగ్య సమస్యల వలనో రోజుకు వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ఇందులో సామాన్యులే కాక సెలబ్రిటీలు సైతం ఉన్నారు. తాజాగా అనుకోని అతిథి చిత్ర నిర్మాత అన్నంరెడ్డి కృష్ణకుమార్ ఈ రోజు ఉదయం విశాఖపట్నంలో గుండెపోటుతో కన్నుమూసారు. ఈయన అనుకోని అతిథి చిత్రం తెలుగు వెర్షన్ కు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కృష్ణ కుమార్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.
నాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా మళయాళ స్టార్ నటుడు ఫహద్ ఫాజిల్ హీరోగా నటించిన ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ చిత్రం “అథిరన్”.ఈ సినిమా ఇప్పటికే మలయాళంలో విడుదలై మంచి విజయం సాధించింది. తెలుగులో అనుకోని అతిథి పేరుతో 2019లో విడుదల కావలసి ఉన్ప్పటికీ పలు కారణాల వలన వాయిదా పడింది. ఈ నెలలో ఆహాలో స్ట్రీమ్ చేయనున్నారు. మరి కొద్ది రోజులలో సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో నిర్మాత మరణించడం చిత్ర బృందానికి దిగ్భ్రాంతిని కలగజేసింది.