డైలాగ్ కింగ్ సాయి కుమార్ యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహా స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. యాదాద్రి ఆలయ నిర్మాణం చాలా బాగుందన్నారు. అంతటా యాదాద్రి ఆలయంపైనే చర్చ జరుగుతోందని ఆయన స్పష్టం చేశారు.
ప్రస్తుతం సాయి కుమార్ పలు షోస్తో పాటు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన తనయుడు ఆదిని మంచి హీరోగా నిలబెట్టేందుకు కృషి చేస్తున్నారు. ఆది సాయి కుమార్ కెరీర్లోనే భారీ బడ్జెట్తో రూపొందుతున్న చిత్రం ‘అమరన్ ఇన్ ది సిటీ-చాప్టర్ 1’. ఎస్.బలవీర్ దర్శకుడిగా పరిచయం చేస్తూ ఎస్వీఆర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆది పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ చిత్రంలో అవికా గోర్ నాయికగా నటిస్తోంది. రీసెంట్గా చిత్ర షూటింగ్ మొదలు కాగా, ఇందులో సాయి కుమార్, ఆదిత్య ఓం, కృష్ణుడు, మనోజ్ నందన్, వీర శంకర్, అయన్, శృతి, రోషన్, మధు మణి తదితరులు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.