ధారూరు, మార్చి 23 : సరైన పోషక పదార్థాలను తల్లులు తీసుకున్నప్పుడే ఆరోగ్యకరమైన పిల్లలకు జన్మనిస్తారని ధారూరు జడ్పీటీసీ కోస్నం సుజాత అన్నారు. మంగళవారం ధారూరు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, కేజీబీవీ పాఠశాలలో పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని అంగన్వాడీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సరైన పోషక పదార్థాలను తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. ఆహార పదార్థాలపై అవగాహన ఉండాలన్నారు. ఆహార సమూహాలు, ఆహార వైవిధ్యం యొక్క ప్రాముఖ్యత, రక్తహీనత, ఐరన్, విటమిన్-సీ, అధికంగా ఉండే ఆహారం గురించి వివరించారు. సరైన ఆహారపు అలవాట్ల గురించి అవగాహన కల్పించి చిరుధాన్యాలు, కూరగాయలను ప్రదర్శనగా ఉంచారు. కార్యక్రమంలో సీడీపీవో వెంకటేశ్వరమ్మ, ధారూరు సర్పంచ్ చంద్రమౌళి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఐసీడీఎస్ సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.