అద్భుతమైన బాణీలను సమకూరుస్తూ శ్రోతలను ఎంతగానో అలరించే మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ. ప్రస్తుతం ఆయన చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. ఇక మణిశర్మ తనయుడు.. యువ సంగీత దర్శకుడు మహతి స్వరసాగర్ కూడా టాలీవుడ్లో సత్తా చాటుతున్నాడు. ఛలో, భీష్మ, మాస్ట్రో చిత్రాలకు సంగీతం అందించిన మహతి స్వరసాగర్ రీసెంట్గా గాయని సంజన కలమంజతో నిశ్చితార్థం జరుపుకున్నాడు.
ఈ వేడుక కేవలం కుటుంబ సభ్యులు..అతికొద్ది మంది బంధువుల సమక్షంలోనే జరిగింది. సాగర్ తన నిశ్చితార్థం ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవరకు ఈ విషయం ఎవరికి తెలియరాలేదు. సాగర్- సంజనల పెళ్లి తేదిని ఇంకా ఖరారు చేయనట్లు తెలుస్తోంది. త్వరలోనే పెళ్లి తేదీని ప్రకటించి అఫీషియల్గా ప్రకటించనున్నట్టు తెలుస్తుంది.
సాగర్ సంగీత దర్శకుడు కాకముందు తండ్రి వద్ద సౌండ్ ఇంజనీర్ గా పనిచేసాడు. ఆ తర్వాత తండ్రి సూచనలు..సలహాలు.. శిక్షణ మేరకు సంగీత దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఇక సంజనా కలమంజే కోలీవుడ్..టాలీవుడ్..శాండిల్ వుడ్ చిత్రాల్లో పాటలు పాడారు. సాగర్ సంగీతం అందించిన భీష్మ లో ‘హేయ్ చూసా’ అనే పాటను ఆమె ఆలపించారు. మరి వీరిద్దరిది ప్రేమ వివాహమా? పెద్దలు కుదిర్చిన సంబంధమా? అన్న వివరాలు ఇంకా బయటకు రాలేదు.