కాబూల్ : ఆఫ్ఘనిస్తాన్లో శాంతియుత వాతావరణాన్ని ఏర్పాటు చేసే లక్ష్యంతో వచ్చిన అమెరికా సేనలు దాదాపు 20 ఏండ్ల తర్వాత ఇండ్లకు తిరుగుముఖం పట్టనున్నాయి. 2400 మంది సైనికుల త్యాగం తరువాత సైన్యం స్వదేశానికి తిరిగి వస్తున్నది. ఆఫ్ఘనిస్తాన్లో శాంతిని నెలకొల్పేందుకు అమెరికా ఈ సేనలపై దాదాపు రూ.150 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తున్నది.
20 సంవత్సరాల సుదీర్ఘమైన, ఖరీదైన యుద్ధం తరువాత అమెరికన్ సైనికులు ఆఫ్ఘనిస్తాన్ నుంచి తమ దేశానికి తిరిగి వెళ్లేందుకు సిద్దమయ్యారు. 9/11 దాడి యొక్క 20 వ వార్షికోత్సవం సెప్టెంబర్ 11 నాటికి ఆఫ్ఘనిస్తాన్లోని అమెరికా దళాలన్నీ ఇండ్లకు బయలుదేరనున్నాయి. అంతకుముందు ఈ గడువు మే 1గా ఉండేది. అయితే కొన్ని పరిస్థితుల కారణంగా సైన్యాన్ని ఉపసంహరించుకునే సమయాన్ని పొడగించారు. 2001 లో అల్ ఖైదా 9/11 దాడుల తరువాత అమెరికా ఆఫ్ఘనిస్తాన్లో బలగాలను మోహరించింది. ఈ యుద్ధంలో అమెరికా దాదాపు 2400 మంది సైనికులను కోల్పోయింది.
అలాగే, ఈ యుద్ధంలో అమెరికా 2 ట్రిలియన్ డాలర్లు అంటే రూ.150 లక్షల కోట్లు ఖర్చు చేసింది. 2011 మే లో ఒసామా బిన్ లాడెన్ను అమెరికా చంపింది. అయితే, తాలిబాన్లను మాత్రం నిర్మూలించలేకపోయింది. అలాగే, ఆఫ్ఘనిస్తాన్లో శాంతిని నెలకొల్పలేకపోయారు. చాలా మంది రిపబ్లికన్ల నుంచి సుదీర్ఘ చర్చ, వ్యతిరేకత ఉన్నప్పటికీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సైన్యాన్ని వెనక్కిరప్పించాలన్న నిర్ణయం తీసుకున్నారని బైడెన్ పరిపాలన ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
టర్కీ, ఖతార్ వంటి దేశాలతో ఆఫ్ఘనిస్తాన్ శాంతి సమావేశాలు నిర్వహించనున్నది. టర్కీ కూడా నాటోలో ఒక భాగం. ప్రస్తుతానికి చాలా శక్తివంతమైనది. ఈ నెల 24 న శాంతి చర్చలు నిర్వహించేందుకు టర్కీ సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో నాటో సేనలు పూర్తిగా దేశం వదిలి పోయినప్పుడు శాంతి చర్చలకు వస్తామని తాలిబాన్లు కరాఖండిగా చెప్పడంతో ఆఫ్ఘనిస్తాన్లో అంతర్యుద్ధం పరిస్థితి మళ్లీ తెరపైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. సెప్టెంబర్ 11 నాటికి పూర్తిగా బలగాలను తొలగిస్తామని అమెరికా చెప్తుండగా.. అదేం కుదరదు ఈనెలలోనే పూర్తిగా తరలించాలని తాలిబాన్లు పట్టుబడుతున్నారు.
కచ్ వద్ద పాకిస్తానీయుల పట్టివేత.. 150 కోట్ల హెరాయిన్ స్వాధీనం
66 ఏండ్ల క్రితం ప్రారంభమైన మెక్డోనాల్డ్.. చరిత్రలో ఈరోజు
భారత్లో బోరిస్ జాన్సన్ పర్యటన కుదింపు
చంద్రుడిపై రోవర్ను పంపేందుకు జపాన్తో జతకట్టిన అరబ్ ఎమిరేట్స్
ఎవర్ గివెన్ను స్వాధీనం చేసుకోండి : ఈజిప్ట్ కోర్టు
జూన్ 1 నుంచి హాల్మార్క్ నగలే అమ్మాలి..
టీకా వేసుకోండి.. ఎక్కువ వడ్డీ పొందండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..