ప్రముఖ నటి, జాతీయ అవార్డు గ్రహీత శారద కన్నుమూసినట్లు ఆదివారం సోషల్మీడియాలో ప్రచారం జరిగింది. ఈ వార్తలతో తెలుగు పరిశ్రమలోని నటీనటులతో పాటు ఆమె అభిమానులు కలవరపాటుకు గురయ్యారు. వాటిలో నిజానిజాలేమిటో అని చాలా మంది ఆరాతీశారు. తనపై వస్తోన్న వార్తల్ని శారద ఖండించింది. ‘నా ఆరోగ్యం బాగుంది. కొంచెం ఒంట్లో నలతగా అనిపిస్తోంది. సోషల్మీడియాలో వచ్చే వార్తలను నమ్మొద్దు. ఎవరో చేసిన తప్పు పనికి అభిమానులు, శ్రేయోభిలాషులు ఆందోళనకు గురయ్యారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఇలాంటి దుష్ప్రచారం చేయడం బాధాకరం’ అని శారద స్పష్టం చేసింది.