కరోనా బుసలు కొడుతుంది.గత ఏడాది కన్నా ఈ ఏడాది కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. మరణాల సంఖ్య కూడా క్రమక్రమేపి పెరుగుతున్నాయి. సామాన్యులే కాదు సెలబ్రిటీలు సైతం కరోనా బారిన పడుతుండడం ఆందోళన కలిగిస్తుంది. రీసెంట్గా పవన్ కళ్యాణ్, అనీల్ రావిపూడి, సోనూసూద్ వంటి స్టార్స్కు కరోనా పాజిటివ్ రాగా, తాజాగా గద్దలకొండ గణేష్లో నటించిన తమిళ నటుడు అథర్వ, నటి సమీరా రెడ్డి, బాలీవుడ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ రాజేశ్ ఖట్టర్ కరోనా బారిన పడ్డారు.
అథర్వ తన సోషల్ మీడియాలో తనకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందని చెబుతూ, స్వల్ప లక్షణాలు కనిపించటంతో కొవిడ్ పరీక్ష చేయించుకోగా… పాజిటివ్గా నిర్థారణ అయిందని హీరో అథర్వ అన్నారు. ఇక సమీరా రెడ్డి.. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని పేర్కొంది. ధైర్యంగా ఉండాల్సిన సమయం ఇది. అందరు జాగ్రత్తగా ఉండండి ఇన్స్టాగ్రామ్లో పేర్కొంది. కన్నడ నటి నయనా నాగరాజ్ కూడా కరోనా బారిన పడ్డారు. ఇక కన్నడ నటుడు, నిర్మాత డి.ఎస్. మంజునాథ్ కరోనాతో కన్నుమూశారు.