మహాసామ్రాజ్ఞి వీర గాథ

కాకతీయ మహాసామ్రాజ్ఞిగా భారతీయ చరిత్రపుటల్లో నిలిచిపోయింది రాణి రుద్రమదేవి. అసమాన ధైర్యసాహసాలతో దక్షిణపథాన్ని పాలించిన వీరవనితగా ప్రసిద్ధికెక్కింది. మహా పరాక్రమవంతురాలైన రుద్రమదేవి జీవిత కథ బుల్లితెరపై ‘రాణి రుద్రమ’ పేరుతో ధారావాహికగా రాబోతున్నది. ‘స్టార్మా’లో ఈ నెల 18నుంచి ప్రసారం కానుంది. ‘ధైర్యసాహసాలు మూర్తీభవించిన విశిష్టగాథల్ని తెలుగు ప్రేక్షకులకు అందించడంలో మా సంస్థ ఎప్పుడూ ముందుంటుంది. ఆ పరంపరలో తెలుగు నేలపై ధీరవనితగా జగతికెక్కిన రుద్రమదేవి జీవితగాథను ప్రేక్షకులకు అందించబోతున్నాం. ఈ ధారావాహిక నిర్మాణంలో వందలాది మంది పాలుపంచుకుంటున్నారు. కాకతీయ సామ్రాజ్య వైభవానికి దర్పణంలా, అద్భుత దృశ్యకావ్యంగా ఈ సీరియల్ను తీర్చిదిద్దుతున్నాం. ఇంతకుముందెన్నడు బుల్లితెరపై చూడని ఉన్నత స్థాయి ప్రమాణాలతో ఈ సీరియల్ను రూపొందిస్తున్నాం’ అని ‘స్టార్మా’ సంస్థ తెలిపింది. అనన్య, ఆనంద్, రాధి, శ్రీధర్రావు, గౌరి తదితరులు ఈ ధారావాహికలో నటిస్తున్నారు.
తాజావార్తలు
- ఇస్రోతో దేశ ఖ్యాతి వర్ధిల్లుతున్నది : సీఎం కేసీఆర్
- దక్షిణ చైనా సముద్రంలో చైనా లైవ్ ఫైర్ డ్రిల్
- తమిళం నేర్చుకోనందుకు బాధగా ఉంది: మోదీ
- సింగరేణి కాలనీలో ఉచిత మల్టీ స్పెషాల్టీ వైద్య శిబిరం
- ఏడుగురు నకిలీ పోలీసుల అరెస్టు
- మార్చి 14 వరకు నైట్ కర్ఫ్యూ.. స్కూళ్లు బంద్!
- పెళ్ళిపై నోరు విప్పిన శ్రీముఖి..!
- తెలంగాణ రైతు వెంకట్రెడ్డికి ప్రధాని మోదీ ప్రశంసలు
- సిలికాన్ వ్యాలీని వీడుతున్న బడా కంపెనీలు.. ఎందుకంటే..?
- ‘సుందిళ్ల బ్యారేజీలో తనిఖీలు’