ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్(WTC) ఫైనల్ ఈ ఏడాది జూన్ 18 నుంచి 22 వరకు బ్రిటన్లోని సౌతాంప్టన్లో జరగనుంది. ఆరంభ టెస్టు చాంపియన్షిప్ ట్రోఫీ కోసం భారత్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఐతే భారత టెస్టు క్రికెటర్లు ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ కన్నా ముందే అక్కడికి బయలుదేరి వెళ్లే అవకాశం ఉంది. జూన్ మొదటి వారంలో బ్రిటన్కు బయలుదేరి వెళ్లాలని భావించారు. కానీ, కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రయాణ ఆంక్షలు విధించడంతో మే చివరి వారంలోనే టీమ్ఇండియా అక్కడికి వెళ్లనున్నట్లు తెలిసింది.
భారత్లో కరోనా ఉద్ధృతి తీవ్రస్థాయిలో ఉండటంతో ఇండియా నుంచి రాకపోకలపై బ్రిటీష్ ప్రభుత్వం నిషేధం విధిస్తూ రెడ్ లిస్ట్లో చేర్చింది. భారత క్రికెటర్లను ఇంగ్లాండ్లోకి అనుమతించేలా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్…బ్రిటన్ ప్రభుత్వంతో పాటు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డుతో చర్చలు జరుపుతోంది.